Thursday, 19 September 2019

చైతూ సినిమా శౌర్య దగ్గరికి.. ఫలించిన కొత్త దర్శకురాలి నిరీక్షణ!

కొంత మంది దర్శకులు ఒక హీరోని మనసులో అనుకొని కథను రాసుకుంటారు. కొంత మంది నిర్మాతలు దర్శకులు చెప్పిన కథను విని ఫలానా హీరో అయితే సరిపోతాడు అని ఫిక్స్ అవుతారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ వాళ్లు అనుకున్న కాంబినేషన్ కుదరదు. ఒక హీరో దగ్గర నుంచి కథ మరో హీరో దగ్గరికి వెళ్లిపోతుంది. అలా అక్కినేని నాగ చైతన్య దగ్గర నుంచి నాగశౌర్య వద్దకు ఒక కథ వెళ్లింది. ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కుతోంది. లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు నాగచైతన్యకు ఒక కథ చెప్పారని, ఆయన కూడా అంగీకరించారని ఆ మధ్య వార్తలు వచ్చారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుందని కూడా అన్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, మళ్లీ ఈ ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు. ఇప్పుడు సడెన్‌గా ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్మెంట్స్ తమ 8వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే, ముందు వచ్చిన వార్తల ప్రకారం హీరో నాగచైతన్య కాదు నాగశౌర్య. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం నిర్మాణ సంస్థ, దర్శకురాలు మారలేదు.. హీరో మాత్రం మారిపోయారు. దీంతో అప్పట్లో నాగచైతన్యతో అనుకున్న సినిమానే ఇప్పుడు నాగశౌర్యతో చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కారణాలేమిటో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి నాగచైతన్య పక్కకు తప్పుకున్నారనేది ఇండస్ట్రీ టాక్. సినిమా చేస్తామని లక్ష్మీ సౌజన్యకు మాటిచ్చిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఆమెకు మొత్తానికి న్యాయం చేసింది. సౌజన్య నిరీక్షణ ఫలించింది. Also Read: కారణాలేమైనా.. యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారన్నది ఫైనల్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30comOa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...