Thursday, 26 September 2019

త్రివిక్రమ్‌ను థ్రిల్ చేసిన ‘రాగల 24 గంటల్లో’ టీజర్

టాలెండెట్ యాక్టర్ సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘యమగోల - మళ్లీ మొదలైంది’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ సినిమాల దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తు్న్నారు. శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్ర ప్రచారంలో భాగంగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా టైటిల్‌ బావుంది. టీజర్‌ చూశాను. నిజంగా చాలా థ్రిల్‌ ఫీలయ్యాను. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్‌ అంజి వర్క్‌ బావుంది. దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్‌ కానూరుకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. త్రివిక్రమ్ చెప్పినట్టు టీజర్ నిజంగానే థ్రిల్లింగ్‌గా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ‘ఒకరికి ఒకరు’ ఫేమ్ శ్రీరామ్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటించారు. టీజర్ అయితే ఆసక్తికరంగా ఉంది. కాకపోతే దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి ఫామ్ చూస్తుంటేనే కాస్త ఆందోళన కలుగుతోంది. ఆయన గత రెండు చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాతో ఏ మాయ చేస్తారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lgmn92
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...