ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ అధినేత జగన్ను పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారు. 151 సీట్లతో అఖండ విజయాన్ని నమోదు చేసిన జగన్పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ పొలిటికల్ బాహుబలిపై టాలీవుడ్ బాహుబలి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒకవైపు జగన్ సీఎం అయినా టాలీవుడ్ నుండి ప్రముఖులు ఎవరూ శుభాకాంక్షలు అందించలేదని ఎస్వీబీసీ చైర్మన్ , ప్రముఖ కమెడియన్ పృథ్వీ తెగ ఫీల్ అవుతూ ఇండస్ట్రీ పెద్దల్ని తప్పుపట్టారు. ఈ ఇష్యూపై రాజేంద్రప్రసాద్, పోసాని తదితరులు కల్పించుకోవడంతో పెద్ద దుమారమే లేచింది. ఈ సందర్భంలో గురించి ప్రభాస్కు ఆసక్తికమైన ప్రశ్న ఎదురైంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో పాల్గొంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం తమిళనాడు ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా.. చెన్నైలోని వివిధ చానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. ఈ సందర్భంగా.. తమిళనాడులో ఏపీ సీఎం జగన్ను పొలిటికల్ బాహుబలిగా అభివర్ణిస్తున్నారని.. ఆయన గురించి మీరు ఏం అనుకుంటున్నారంటూ.. యాంకర్ ప్రభాస్ని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడిన ప్రభాస్.. పాలిటిక్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే యంగ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ను జగన్ అభివృద్ధి పథంలో నడిస్తారనే నమ్మకమైతే ప్రజల్లో ఉంది. జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు ప్రభాస్. మొత్తానికి జగన్ పాలనపై ప్రభాస్ ప్రశంసలు కురిపించడంతో వైసీపీ అభిమానులు ప్రభాస్కి సాహో అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. ఇక సాహో సినిమా విషయానికి వస్తే.. సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘బాహుబలి’ తరవాత నటించిన సినిమా కావడంతో ‘సాహో’పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు ప్రచార కార్యక్రమాల జోరును పెంచింది చిత్ర యూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33G3TAo
v
No comments:
Post a Comment