టాలీవుడ్ హాట్ బ్యూటీ మెగాస్టార్ మనసు గెలుచుకుంది. ఆయన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్కి స్టెప్పులేసి అదరహో అనిపించుకుంది. ఈ ప్రదర్శనను మెగాస్టార్కు అంకితం ఇస్తున్నాని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ ఘటన ప్రతిష్టాత్మక సైమా అవార్డుల ప్రధానోత్సవంలో చోటుచేసుకుంది. నిధి తన ఎలక్ట్రిఫయింగ్ పెర్ఫార్మెన్స్తో శ్రోతలను ఉర్రూతలూగించింది. ఏటా దక్షిణాది సినిమాలకు పురస్కారాలను అందజేసే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఈ ఏడాది ఖతార్లోని దోహాలో ప్రారంభమైంది. గురువారం ప్రారంభమైన ఈ వేడుక శుక్రవారం రాత్రి వరకు కొనసాగనుంది. గురువారం రాత్రి తెలుగు, కన్నడ సినిమాలకు అవార్డులు అందజేశారు. శుక్రవారం రాత్రి తమిళం, మలయాళ చిత్రాలకు అవార్డులు అందజేస్తారు. గురువారం రాత్రి జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిగా విచ్చేశారు. చిరంజీవి గౌరవార్థం ఆయన సినిమాలోని సూపర్ హిట్ పాటలకు నిధి అగర్వాల్తో డ్యాన్స్ షో ఏర్పాటు చేశారు. హార్లే డేవిడ్సన్ బైక్పై స్టైల్గా ఎంట్రీ ఇచ్చిన నిధి ఆ తరవాత తన డ్యాన్సులతో వేదికను ఊపేసింది. వేదిక పైనుంచే కింద కూర్చుకున్న చిరంజీవి వద్దకు పరుగున వెళ్లింది. ఆయనికి చేయి అందించింది. ఆత్మీయంగా హత్తుకుంది. చిరంజీవి కూడా చాలా ఆనందంగా, ఆప్యాయంగా నిధిని ప్రశంసించారు. పెర్ఫార్మెన్స్ అనంతరం మాట్లాడుతూ తన ప్రదర్శనను చిరంజీవికి అంకితమిస్తున్నానని చెప్పింది. అంతకు ముందు రెడ్ కార్పెట్పై అదిరిపోయే డ్రెస్లో నిధి కనులవిందు చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YR7g8Q
v
No comments:
Post a Comment