Tuesday, 27 August 2019

సాయి పల్లవి.. నాగచైతన్య.. ఓ కులం

ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కులం పేరుతో కాంట్రొవర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఆ బాటలోనే నడుస్తున్నట్లున్నారు. , సాయి పల్లవితో కలిసి ఆయన తెరకెక్కిస్తున్న సినిమాను కులం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు సినిమాలో లైంగిక వేధింపుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరో విషయం ఏంటంటే.. సినిమా మొత్తం తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసతో యువత మనసు దోచుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. ఆయన తెలంగాణ యాసలో మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. సినిమాలని ఇతర పాత్రలకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు. మరోపక్క నాగచైతన్య.. తన మేనమామ వెంకటేశ్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి కూడా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె రానా దగ్గుబాటితో కలిసి ‘విరాట పర్వం’ సినిమాలో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zlA0aq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...