సినిమాల విషయం ఏమోగానీ ఒక్క కారు యాక్సిడెంట్తో హీరో బోలెడంత పాపులారిటీ సంపాదించారు. ప్రమాదం జరిగిన తరవాత రోజు (ఆగస్టు 20) నుంచి ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపురి టౌన్షిప్ వద్ద తన వోల్వో కారుతో యాక్సిడెంట్ చేసిన రాజ్ తరుణ్ అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తరవాత రాజ్ తరుణ్పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు 41 సిఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రాజ్ తరుణ్ ఎట్టకేలకు శుక్రవారం పోలీసులు ఎదుట హాజరయ్యారు. రాజ్ తరుణ్ నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు అనంతరం ఆయన్ని బెయిల్పై విడుదల చేశారు. కేసులో భాగంగా రాజ్ తరుణ్ సోమవారం కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. Also Read: ఇదిలా ఉంటే, యాక్సిడెంట్ జరిగిన తరవాత రాజ్ తరుణ్ కనిపించకపోవడంతో ఆయన ఎక్కడా ఎక్కడా? అంటూ మీడియా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇదేం బాధరా బాబోయ్ అనుకున్నారో ఏమో.. బుధవారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మీడియాకు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ యాక్సిడెంట్ చేసింది తానేనని, సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల బయటపడ్డానని, దయచేసి కారు నడిపేవాళ్లంతా సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే, యాక్సిడెంట్ చేసి పారిపోతున్న సమయంలో రాజ్ తరుణ్ను స్థానిక వ్యక్తి కార్తీక్ వీడియో తీశారు. రాజ్ తరుణ్ను కొన్ని ప్రశ్నలు వేశారు. యాక్సిడెంట్ చేసింది మీరా కాదా? అని దబాయించారు. ఆ వీడియోను కార్తీక్ పోలీసులకు ఇవ్వకుండా రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రకు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించాడని ప్రధాన ఆరోపణ. రాజా రవీంద్ర ఫిర్యాదు మేరకు కార్తీక్పై కూడా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L1DoN6
v
No comments:
Post a Comment