Sunday, 4 August 2019

‘రణరంగం’ ట్రైలర్.. ఎన్టీఆర్ మద్యనిషేధంతో మొదలు!

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా కాకినాడలో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం దాన్ని యూట్యూబ్‌లో అందుబాటులోకి తెచ్చారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మొదలవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రభుత్వం మద్యనిషేధాన్ని తీసుకొచ్చిన తరవాత విశాఖపట్నానికి చెందిన ఒక కుర్రాడు లిక్కర్ మాఫియాను మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి మాఫియా డాన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన పరిస్థితులు, ప్రేమ వంటి అంశాల కలయికే ‘రణరంగం’. ట్రైలర్ చూస్తుంటే మరో వైవిధ్యమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని అర్థమవుతోంది. ‘‘ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు అంటే డబ్బులెక్కువై అనుకున్నాను. కొంత మంది కోసం కట్టొచ్చు. ఖర్చుపెట్టొచ్చు’’ అనే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. 1980ల బ్యాక్‌డ్రాప్‌లో వైజాగ్‌లో కథ మొదలైంది. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కల్పిత కథ ఇదని ట్రైలర్‌లో ముందుగానే చెప్పారు. హింస ఎక్కువగానే ఉంది. కానీ, ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఫ్లాష్ బ్యాక్‌లో శర్వానంద్‌కు జంటగా కళ్యాణి నటించారు. ఇక, డాన్‌గా ఎదిగిన తరవాత కాజల్ జంటగా కనిపించారు. ఈ రెండు కాలాలో శర్వానంద్ పాత్రలోని వేరియేషన్ కూడా బాగా చూపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yIH3cN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...