Friday, 16 August 2019

కౌశల్ డైరెక్షన్‌లో హెబ్బా పటేల్.. ‘బిగ్ బాస్’ విన్నర్ ఆసక్తికర ప్రకటన

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో కుర్రకారు మనసు దోచిన హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమా తరవాత తెలుగులో కుర్ర హీరోలతో జోడి కడుతూ సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ను కొనసాగించింది. కానీ, ఆమె హవా ఎన్నాళ్లో కొనసాగలేదు. గడిచిన రెండేళ్లలో హెబ్బా పటేల్‌కు సరైన హిట్టు పడలేదు. కిందతేడాది ‘24 కిసెస్’తో బాగా హీటెక్కించిన హెబ్బా.. సినిమా విడుదల తరవాత ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ సినిమా తరవాత హెబ్బాకు మళ్లీ అవకాశం రాలేదు. అయితే, ‘బిగ్ బాస్’ సీజన్ 2 విజేత కౌశల్ దర్శకత్వంలో నటించింది. ఈ విషయాన్ని కౌశల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అయితే, కౌశల్ దర్శకత్వంలో హెబ్బా పటేల్ నటించింది సినిమాలో కాదు.. ఒక వాణిజ్య ప్రకటనలో..!! కౌశల్‌కు యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ ఉన్న విషయం తెలిసిందే. ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనక ముందు కౌశల్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే యాడ్ ఫిల్మ్స్‌ను కౌశల్ నిర్మించేవారు. ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్నప్పుడు సుమారు 100 రోజులపాటు యాడ్ ఫిల్మ్స్ నిర్మాణానికి గ్యాప్ ఇచ్చిన కౌశల్.. మళ్లీ ఇప్పుడు తన అసలు పనిని షురూ చేశారు. తాను శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్‌ను హెబ్బా పటేల్‌పై చిత్రీకరిస్తున్నట్టు కౌశల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. హెబ్బాతో దిగిన సెల్ఫీని కూడా షేర్ చేశారు. ‘‘టైటిల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, నా బహుముఖ ప్రతిభ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నాను’’ అని కౌశల్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ వాణిజ్య ప్రకటన టీవీలు, థియేటర్లలో దర్శనమివ్వనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MllesK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...