ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ తొలి పోస్ట్తో కోట్లాది హృదయాలను టచ్ చేశారు. శుక్రవారం నాడు ఒక సర్ప్రైజ్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నా అని ముందే ప్రకటించిన రామ్ చరణ్ అన్నట్టుగానే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తితో దిగిన ఫొటోని షేర్ చేశారు. ‘నా తొలి పోస్ట్ నీకే అంకితం చేస్తున్నా.. లవ్యూ అమ్మా.. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అమ్మ ప్రేమ మాదిరిగా’ అంటూ తన తల్లి ఒడిలో తలపెట్టుకుని హాయిగా చిరునవ్వులు చిందుస్తున్న ఫొటోనే షేర్ చేశారు రామ్ చరణ్. మరో ఫొటోలో తన చిన్నప్పుడు తల్లి ఒడిలో ఇలాగే పడుకుని ఉన్న ఫొటోని షేర్ చేశారు. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫొటోని మెగా అభిమానులు లైక్స్ మోత మెగిస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య గంట గంటకూ వేలాదిగా పెరుగుతోంది. ఇప్పటికి ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు 3.2 మిలియన్, అల్లు అర్జున్ 3.5 మిలియన్, ప్రభాస్ 2.2 మిలియన్ జూనియర్ ఎన్టీఆర్ 973k, ఫాలోవర్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రామ్ చరణ్ స్పీడ్ చూస్తుంటే వీరి సరసన చేరేందుకు ఎక్కువ సమయం తీసుకునేట్టు కనిపించడం లేదు. కాగా రామ్ చరణ్ని ఇన్స్టాగ్రామ్కి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ.. ఉపాసన, అల్లు అర్జున్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్లు పోస్ట్లు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y0XxeP
v
No comments:
Post a Comment