Friday, 12 July 2019

సందీప్ కిషన్‌కు జీహెచ్ఎంసీ షాక్.. పోస్టర్లు చించి..!

హీరో ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నారు. సుమారు నాలుగైదేళ్లుగా విజయానికి దూరమైన ఈ యంగ్ హీరో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని నిర్మాతగా కూడా మారారు. ‘నిను వీడని నీడను నేనే’ అనే థ్రిల్లర్ మూవీని నిర్మించారు. హీరోగా నటించి స్వయంగా ఆయనే నిర్మించుకున్న ఈ సినిమాకు ప్రచారం బాగానే కల్పించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, సందీప్ కిషన్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ పిల్లర్లకు మధ్యలో ఏర్పాటుచేసిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా పోస్టర్లను తొలగించింది. చిత్ర ప్రచారంలో భాగంగా నగర వ్యాప్తంగా ‘నిను వీడని నీడను నేనే’ పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఉప్పల్‌లో మెట్రో రైల్ పిల్లర్ల మధ్య ఏర్పాటుచేసిన అడ్వటైజింగ్ బోర్డులలో కూడా పోస్టర్లు అతికించారు. అయితే ఈ పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయని ఉప్పల్ వాసులు కొందరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ పోస్టర్లను చించేశారు. మెట్రో మార్గం ద్వారా ఉన్న పోస్టర్లన్నింటినీ తొలగించారు. జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చిత్ర యూనిట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్ని అనుమతులు తీసుకునే పోస్టర్లు ఏర్పాటుచేశామని, అలాంటిది కనీసం సమాచారం ఇవ్వకుండా వాటిని తొలగించడమేంటని అంటున్నారు. కేవలం సినిమా ప్రచారం కోసమే ఈ పోస్టర్లను ఏర్పాటుచేశామని, దురుద్దేశంతో కాదని చిత్ర యూనిట్ అంటోంది. సినిమా విడుదల సమయంలో తమను లక్ష్యంగా చేసుకుని ఇలా చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసభ్యకరంగా ఉన్నాయని ఫిర్యాదు చేసిన పోస్టర్లతో పాటు మామూలుగా ఉన్న పోస్టర్లను కూడా చించేశారని చిత్ర యూనిట్ ఆరోపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JuyatA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...