Monday, 15 July 2019

ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచి ఉండొచ్చు కానీ.. మహేశ్ బాబు ట్వీట్ అదిరింది!

ఇప్పటి వరకు ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దాదాపుగా అన్ని ఫైనల్స్‌లోనూ ఓ జట్టు భారీగా పరుగులు చేయడం ఛేజింగ్‌కు దిగిన జట్టు తడబడటం చూశాం. లేదంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం.. లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమే తెలుసు. కానీ 2019 వరల్డ్ కప్ ఫైనల్ మాత్రం ఎంతో ప్రత్యేకం. మ్యాచ్‌తోపాటు సూపర్ ఓవర్ కూడా టై ముగిసింది. విజయం కోసం ఇరు జట్లు ఎంతలా పోరాడాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. చివరకు ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు రుచించడం లేదు. కానీ అత్యద్భుమైన క్రికెట్ మ్యాచ్ చూశామనే భావన మాత్రం అందరిలో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఎందరో ఈ వరల్డ్ కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్ ప్రదర్శనను పొగుడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ కూడా వరల్డ్ కప్ ఫైనల్‌పై స్పందించారు. ‘‘ఇప్పటికీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ మాత్రం తప్పకుండా హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు’’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. వరల్డ్ కప్ ఫైనల్ విషయమై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఇంగ్లాండ్‌కు 12వ ఆటగాడిగా అదృష్టం కలిసొచ్చిందని ఆయన చమత్కరించారు. కివీస్‌ను చూస్తుంటే బాధగా ఉందన్నారు. కేన్ విలియమ్సన్, కివీస్ జట్టు అద్భుతంగా ఆడిందన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jWv3Ry
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...