Friday, 21 June 2019

TDP: ‘ఎన్టీఆర్ ప్రాణం పోస్తే.. చంద్రబాబు చంపేశాడు’

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన వేళ.. తెలుగు దేశం పార్టీ నుంచి మరింత మంది నేతలు కాషాయ పార్టీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గ నేతలు, కమ్మ సామాజిక వర్గ నేతలు.. ఇలా విడతల వారీగా నేతల్లో చాలా మంది బీజేపీ గూటికి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు.. అధికారాన్ని అనుభవించిన నేతలంతా ఇప్పుడు పార్టీ మారుతుండటంతో.. టీడీపీ అధినాయకత్వానికి, కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఏపీలో టీడీపీ స్థానాన్ని తాను భర్తీ చేసేలా బీజేపీ అడుగులు వేస్తున్న వేళ.. తెలుగు తమ్ముళ్లలో నిర్వేదం కనిపిస్తోంది. కానీ టీడీపీని, చంద్రబాబును ద్వేషించే వాళ్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు గింజుకోవడం అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ సంక్షోభంలో ఉన్న వివాదాస్పద దర్శకుడు కూడా తనదైన స్టయిల్లో స్పందించారు. చరిత్ర పునరావృత్తం అవుతోంది. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడిచినట్టే.. విదేశాలకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ టీడీపీకి పురుడు పోస్తే.. చంద్రబాబు చంపేశాడని ఘాటుగా మరో ట్వీట్ చేశాడు. కొందరు నెటిజన్లు వర్మతో ఏకీభవిస్తుండగా.. టీడీపీ అభిమానులు మాత్రం వర్మతో ఆటాడుకుంటున్నారు. ‘శివ’ వర్మకు జన్మనిస్తే.. తానే చంపుకున్నాడని సెటైర్లు వేస్తున్నారు. టీడీపీని అంత తేలిగ్గా ఏం చేయలేరంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2J4KJuy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...