తమిళ సినీ పరిశ్రమలోని అందమైన జంటల్లో విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), నయనతార (Nayanthara) జోడి ఒకటి. ఈ ఇద్దరు తారలు ఈరోజు (జూన్ 9న) తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే, ఈరోజును కేవలం పెళ్లిరోజుగా మాత్రమే కాకుండా ఇంకా ప్రత్యేకమైన రోజుగా వారు జరుపుకుంటున్నారట. దీనికి కారణం వారి ఇద్దరు కొడుకులు ఉయిర్, ఉలగ్. తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య నయనతార, ఇద్దరు కొడుకులను ఉద్దేశించి మనసును హత్తుకునే ఒక సందేశాన్ని విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రాసుకొచ్చారు. నయనతార తన ఇద్దరు కొడుకులను ఎత్తుకుని ఉన్న కొన్ని ఫొటోలను కూడా విఘ్నేష్ షేర్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zYNyR3w
v
No comments:
Post a Comment