Sunday 6 March 2022

రామ్ చరణ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పిన ఉపాసన.. ఫైనల్‌గా అంటూ పోస్ట్

ఏ మాత్రం విరామ సమయం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నేటితరం స్టార్ హీరోలు. షూటింగ్స్‌లో బిజీగా ఉంటూనే కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తున్నారు. భార్యాపిల్లలతో టూర్స్ వేస్తూ షికార్లు కొడుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన సతీమణి ఉపాసనతో కలిసి ఓ టూర్ వేశారు. ఇందుకు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది . ఫైనల్‌గా రెండేళ్ల తర్వాత ఓ వెకేషన్ ట్రిప్.. థాంక్యూ Mr.C అంటూ చెర్రీతో దిగిన ఓ సెల్ఫీ పిక్ షేర్ చేసింది ఉపాసన. ఎక్కడికి వెళ్లారనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై లైకుల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు 'ఎంజాయ్ ది ట్రిప్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా వారి వృత్తిపరమైన జీవితంలో చాలా బిజీగా ఉంటారు. ఇద్దరికీ వీలు కుదిరి ఇలా టూర్స్ వేయడం చాలా అరుదు. దాదాపు ఐదేళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జోడీ అన్యున్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే భారీ సినిమా RRR కంప్లీట్ చేశారు. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు డేట్స్ ఇచ్చారు చెర్రీ. ఇక ఆ వెంటనే మరో బడా డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్న ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ పూర్తికావడంతో స్మాల్ బ్రేక్ తీసుకొని ఇలా వెకేషన్ ట్రిప్ వేశారు. మరోవైపు తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో భాగమయ్యారు రామ్ చరణ్. సిద్ద పాత్రలో చెర్రీ నటన ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటి కానుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gtBs1Ix
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...