Saturday, 19 February 2022

ఇండస్ట్రీలో విషాదం.. కన్నుమూసిన కన్నడ కళాతపస్వి

కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. వందకు పైగా చిత్రాల్లో నటించి కళాతపస్వీగా పేరుగాంచిన సీనియర్ హీరో, నటులు (89) నేడు తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా ఆస్పత్రితో చికిత్స తీసుకుంటున్న రాజేష్.. నేడు కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో టైపిస్ట్‌గా పని చేసిన విద్యాసాగర్.. సినీ రంగంలో రాజేష్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నాటక రంగం, కథా రచనల్లో రాజేష్‌కు పట్టు ఉంది.కానీ వీర సంకల్ప అనే సినిమాతో తెరంగేట్రం చేసి రాజేష్ అనే పేరుతో పాపులర్ అయ్యారు. అలా నటుడిగా మంచి పేరు రావడంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామ చేసేశారు. 60, 70వ దశకంలో ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఆయన కెరీర్‌లో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. కన్నడ ఇండస్ట్రీలో కళాతపస్వీగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆయనకు ఐదుగురు సంతానం. అందులో ఒక అమ్మాయి ఆషా రాణి. ఆమె కూడా కన్నడలో నటించారు. రాజేష్ మరణం పట్ల కన్నడ చిత్ర తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. కన్నడ సినీ ప్రముఖులంతా కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gsuV5iN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...