Wednesday, 19 January 2022

టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి

ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న మరణాలు కలవరపెడుతున్నాయి. కరోనా ఉధృతిలో ఇప్పటికే ఇండస్ట్రీ చాలా మంది సినీ నటులను కోల్పోయింది. తాజాగా మరో నటుడు కన్నుమూశారు. ఆది, శంకర్ దాదా MBSS, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో లాంటి సినిమాల్లో నటించిన యాక్టర్ (47) అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెందినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. గత కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఎప్పటిలాగే సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వచ్చిన ఆయన కుటుంబంతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది వరకే ఓ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు శ్రీనివాస్ ఛాతి భాగంలో దెబ్బ తగిలిందని, ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు. తెలుగులో సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన కొంచాడ శ్రీనివాస్.. బుల్లితెరపై కూడా అలరించారు. 10కి సీరియళ్లలో ఆయన నటించారు. శ్రీనివాస్ మృతి పట్ల టాలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rS9lNx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...