బాలయ్య బాబుకు కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఎంత సౌమ్యంగా ఉంటారో సందర్భం వచ్చినప్పుడు అంతకంటే కోపం ప్రదర్శిస్తుంటారు ఈ నందమూరి నటసింహం. లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి మాట్లాడటం బాలకృష్ణకు అస్సలు తెలియదు. అది కోపమైనా, సౌమ్యమైనా తాను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టేయడం బాలయ్య బాబు నైజం. ఇలాంటి సీన్ ఒకటి హోస్ట్ చేస్తున్న '' షోలో చోటు చేసుకుంది. దీంతో ఈ సరదా క్లిప్ షేర్ చేసి నెటిజన్లను అట్రాక్ట్ చేసింది 'ఆహా' టీమ్. సంక్రాంతి సందర్భంగా ఈ షోకి గెస్టులుగా వచ్చారు లైగర్ దర్శకనిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మి. వీళ్ళతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా బాలయ్య ఎదుట కూర్చొని సందడి చేశారు. ''ఏదో టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చుని.. నాలుగు ప్రశ్నలు అడిగి.. అవతలి వ్యక్తి తెలివిగా జవాబులు చెబితే మహాప్రభో అనడం నా వల్ల కాదయ్యా బాబు. అందుకే వచ్చిన వాళ్లను ఆడుకుంటానని చెప్పి ఓ షరతుతో ఈ షో చేస్తున్నాను'' అని బాలకృష్ణ అన్నారు. మరి ఇక ఆడేసుకుందామా అంటూ విజయ్, పూరి జగన్నాథ్, ఛార్మిలతో రంగంలోకి దిగారు బాలయ్య బాబు. అయితే ఓ ఆట ఆడుతుండగా.. బాలకృష్ణ నటించిన మొదటి చిత్రం ఏది? అని విజయ్ని హోస్ట్ బాలయ్య అడగడంతో షోకు వచ్చిన అభిమానుల్లో ఒకరు అత్యుత్సాహంతో 'తాతమ్మ కల' అని సమాధానం చెప్పేశాడు. దీంతో బాలయ్యకు కోపం వచ్చేసింది. 'ఇక వాడు నా చేతిలో అయిపోయాడు ఖతం' అంటూ సరదాగా ఆయన వార్నింగ్ ఇచ్చేయడం ఈ వీడియోలో హైలైట్ అయింది. దీంతో పాటు ఎన్నో సరదా సన్నివేశాలతో కూడిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GArJAD
v
No comments:
Post a Comment