Thursday, 2 December 2021

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి! టెన్షన్‌లో నాగార్జున.. ఆయన అనుమానం అదేనా?

గతంలో వచ్చి సూపర్ హిట్ సాధించిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు సీక్వెల్‌గా '' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా భాగమవుతుండగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీ నిర్మాణం విషయంలో అనుకున్నదాన్ని మించి బడ్జెట్ ఖర్చవుతోందని, దీంతో నాగ్ కాస్త టెన్షన్ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ రేంజ్ దాటిపోయిందని తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని నటీనటుల రెమ్యూనరేషన్లతో కలిపి 30 కోట్ల లోపు ఫినిష్ చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పటికే 45 కోట్ల వరకు ఖర్చు పెట్టారని సమాచారం. అయినప్పటికీ ఈ మూవీని నిర్మిస్తున్న జీ సంస్థ వెనక్కి తగ్గడం లేదట. కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో భారీగా ఖర్చు విషయంలో వెనకాడటం లేదట. కాకపోతే నాగార్జున మాత్రం లోలోపల కాస్త టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా నాగార్జున సరైన హిట్ పట్టలేకపోయారు. దీంతో ఇంత బడ్జెట్ కేటాయించి 'బంగార్రాజు' రూపొందిస్తే తిరిగి రాబడుతుందా లేదా అనే అనుమానంలో ఉండిపోయారట నాగ్. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్యలు తాత మనవడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుండగా ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రొమాన్స్, ఎమోషన్స్, అన్నిరకాల కమర్షియల్ అంశాలతో ఈ 'బంగార్రాజు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ojH8hQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...