స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ (). (Rapido) యాడ్లో ఆర్టీసీని కించపరుస్తూ సామాన్యులకు తక్కువ ధరలకే సేవలందిస్తున్న ఆర్టిసీ బస్సులకు వ్యతిరేకంగా ర్యాపిడో సంస్థకు చెందిన యాడ్లో నటించడంతో ర్యాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్కి లీగల్ నోటీసులు పంపారు సజ్జనార్. ఎందుకొచ్చిన పేరంట అండీ ర్యాపిడో బుక్ చేసుకోండి.. ట్రాఫిక్లో చెమటపట్టకుండా వెళ్లిపోండి.. అంటూ అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. టిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం , ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరని అన్నారు సజ్జనార్. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలని హితవు పలికారు సజ్జనార్. టిఎస్ఆర్టీసి సామాన్యుల సేవలో ఉందని.. పబ్లిక్ ప్రాపర్టీని కించపరినందుకు అల్లు అర్జున్కి ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నట్టు ప్రకటనలో తెలియజేశారు సజ్జనార్. వివాదానికి కారణమైన ర్యాపిడో యాడ్ ఇదే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mWcs5F
v
No comments:
Post a Comment