Monday, 15 November 2021

Radhe Shyam : ‘ఈ రాతలే’ రివ్యూ.. జన్మజన్మల బంధం.. కానీ ఎప్పటికీ కలవరా?

అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన ఆ తరుణం వచ్చింది. నుంచి మొదటి పాట వచ్చింది. అంటూ రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మేకర్లు. అయితే సాయంత్రం ఐదు గంటలకు ఇవ్వాల్సిన ఈ అప్డేట్.. దాదాపు తొమ్మిది గంటలకు ఇచ్చారు. అంటే మధ్యలో ఈ నాలుగు గంటలు అభిమానులు తెగ హర్ట్ అయ్యారు. ఎనిమిది గంటలకు ఇస్తామని చెప్పి.. మళ్లీ హ్యాండ్ ఇచ్చారు. ఏది ఏమైనా మొత్తానికి పాట వచ్చింది. అభిమానులను మెప్పించింది. అయితే యానిమేషన్‌లా చూపించడంతో ప్రభాస్, పూజా హెగ్డేలు ఈ లిరికల్ వీడియోలో స్పష్టంగా కనిపించలేదు. కానీ సినిమా కాన్సెప్ట్ ఏంటో మాత్రం అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఎవరో వీరెవరో కలవనీ ప్రేమికులా?.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా అంటూ మొదటగా పాట వస్తుంది. ఆ సమయంలో పూజా హెగ్డే ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఉంటుంది. కారులో ప్రభాస్ వస్తున్నాడు. చేతిలో చేయి వేసి తీసుకునే లోపు ట్రైన్ ప్రమాదం జరుగుతుంది. అంటే అక్కడ ఆ ఇద్దరూ కలుసుకోరని, చనిపోతారని అర్థమవుతోంది. మళ్లీ అక్కడి నుంచి పాటను.. గాల్లోకి ఎగిరిపోతారు.. ఆతరువాత సముద్రంలోకి వెళ్తారు. అయితే అక్కడ అరచేతి బొమ్మలు.. భూతద్దం లాంటివి కనిపిస్తాయి. అయితే చివరకు నీళ్లలో మునిగిపోతారు. అక్కడ లోపల మునిగిన తరువాత కూడా అంతరిక్షంలా కనిపిస్తుంది. గ్రహాలు కనిపిస్తాయి. అయితే మొత్తానికి ఈ పాటను ఇలా గమిస్తుంటే.. వీరిది జన్మజన్మల బంధమని, కానీ ఏ జన్మలోనూ కలిసి జీవించే అదృష్టం లేనట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఒక్కపాటలోనే ఎన్నో హింట్లు వదిలారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CiGPri
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...