Tuesday, 2 November 2021

Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ ఓవర్ బడ్జెజ్.. టెన్షన్‌లో నిర్మాతలు?

ఐకాన్ స్టార్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. రెండు భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే బ‌న్నీ చేస్తున్న తొలి పాన్ ఇండియా ప్ర‌య‌త్నం కావ‌డంతో అందరిలోనూ తెలియ‌ని ఓ చిన్న టెన్ష‌న్ కూడా ఉంది. తాజాగా ఈ సినిమా బ‌డ్జెట్ విష‌యంలో సినీ వ‌ర్గాల్లో కొన్ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. పుష్ప సినిమాకు అనుకున్న బ‌డ్జెట్ కంటే పావు శాతం ఎక్కువైంద‌ని. ముందుగా ఈ సినిమాను రూ.170 కోట్లు బ‌డ్జెట్ అనుకున్నార‌ట‌. సినిమాలో సుకుమార్ ప‌ర్‌ఫెక్ష‌న్ కోసం ప్ర‌య‌త్నించ‌డం, రెండుసార్లు కోవిడ్ ఎఫెక్ట్ వ‌ల్ల సినిమా ఆగ‌డం వంటి పరిస్థితుల‌తో పుష్ప బ‌డ్జెట్ మ‌రో న‌ల‌బై కోట్లు పెరిగిన‌ట్లు స‌మాచారం. దాదాపు ఈ పెరిగిన బ‌డ్జెట్‌తో ఓ బారీ సినిమానే చేయొచ్చు అనేది కాద‌న‌లేని వాస్త‌వం. దీంతో నిర్మాతల్లో చిన్న టెన్ష‌న్ అయితే ఉంది. మరో వైపు అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ఇదే కావ‌డంతో హిందీలో భారీగానే సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు రెడీ అవుతున్నారు. ప్ర‌మోష‌న్స్ కూడా బారీగానే ప్లాన్ చేసుకున్నారు. ఇవ‌న్నీ ఖ‌ర్చు పెరిగే అంశాలే. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్‌లో జ‌రుగుతుంద‌నేది చూడాలి. ఇంకా ఈ సినిమాలో దాదాపు మూడు పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. విదేశాల్లో ఈ పాట‌ల‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశార‌ట డైరెక్ట‌ర్ సుక్కు. కానీ ఇప్ప‌ట్లో ప‌రిస్థితులు కుదిరేలా లేవు. దీంతో హైద‌రాబాద్‌లోనే సెట్స్ వేసి న‌వంబ‌ర్ ద్వితీయార్థానికంతా షూటింగ్ పూర్తి చేసేలా స‌న్నాహాలు చేసుకున్నారట‌. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. రంగ స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కూడా కావ‌డంతో సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా కోసం వేచి చూస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పుష్ప మూవీ తెర‌కెక్కుతోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపించే పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y9mEhu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...