Wednesday, 3 November 2021

దాసరి నారాయణ రావు ఇంటికి నోటీసులు.. గడువు ఇస్తూ కోర్టు ఆదేశాలు

దివంగత సినీ దిగ్గజం ఇంటికి కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దాసరి నారాయణ రావు తనయులు అరుణ్, ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ సెక్షన్ 151 క్రింద సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం రోజు వారికి ఈ నోటీసులు అందాయి. అరుణ్, ప్రభులకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో భాగంగా వారికి కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. గతంలో ఓ ప్లాంట్‌ నిర్మాణం కోసం సోమశేఖర్‌ రావు అనే వ్యాపారి వద్ద 2 కోట్ల 11 లక్షల రూపాయలు తీసుకున్న ప్రభు, అరుణ్‌లు తిరిగి ఆ డబ్బు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం తీసుకున్న గడువు మించిపోవడంతో సదరు వ్యాపారి సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. తన వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభు, అరుణ్‌లు తిరిగి ఇవ్వడం లేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ పిటిషన్ పరిశీలించిన కోర్టు, దాస‌రి ఇంటికి నోటీసులు పంపింది. ఈ నెల 15వ తేదీ లోగా సోమశేఖర్‌ రావు ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. దాసరి నారాయణ రావు బ్రతికున్న సమయంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా వ్యవహారాల్లో చురుకుగా ఉండేవారు. సినీ పెద్దగా సమస్యల పరిష్కారం చేస్తూ అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేవారు. కానీ ఆయన మ‌ర‌ణం త‌ర్వాత త‌న‌యులు ప‌లు వివాదాల‌తో వార్తల్లో నిలుస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w9xi4B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...