ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ ఇటు సినీ రంగాన్ని.. అటు అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. ఎంటైర్ సినీ ఇండస్ట్రీ పునీత్ మరణంపై విచారాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి స్టార్ హీరోలందరూ పునీత్కు నివాళులు అర్పించారు. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పునీత్ మరణంపై స్పందించారు. ఆయన బెంగుళూరులోని పునీత్ రాజ్కుమార్ ఇంటికి వెళ్లారు. పునీత్ చిత్ర పటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ‘‘పునీత్ రాజ్కుమార్ చాలా మంచి వ్యక్తి. మంచి అనుబంధం ఉంది. నాలుగేళ్ల ముందు బెంగుళూరుకి వచ్చినప్పుడు తనను కలిశాను. ఆయన నన్ను ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా మాట్లాడారు. తనతో మాట్లాడుతున్నంత సేపు ఓ స్టార్తో కాకుండా.. ఓ కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అనుభూతే కలిగింది. ఆయన మరణించారని తెలియగానే షాకయ్యాను. ఆయన మన మధ్య లేరనే వార్తను నమ్మలేకపోతున్నాను. సాధారణంగా చిన్న సాయం చేస్తే ప్రపంచమంతా తెలియజేయాలనుకుంటాం. కానీ అలా కాదు. తను ఎంతో మందిక సాయం చేశాడు. కానీ ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు. ఆయన మరణం తర్వాతే ఆ విషయం అందరికీ తెలిసింది’’ అన్నారు. రాజ్ కుమార్ తనయుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్కుమార్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. నటనతో పాటు డాన్సులు, ఫైట్స్తో ఎంతో క్రేజ్ను సంపాదించుకున్నారు. ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు. అలాంటి ఆయనకు ఉన్నట్లుండి గుండెనొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే కూడా ఉపయోగం లేకుండా పోయింది. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టిన పునీత్ మరణం సినీ రంగానికి తీరని లోటు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CRophG
v
No comments:
Post a Comment