Monday, 1 November 2021

సీఎంపై సెటైర్లు.. గోవాలో అలాంటివి చేపిస్తారా?.. ‘గృహలక్ష్మీ’ కస్తూరి కామెంట్స్

మన రాజకీయ నాయకులు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వింత హామీలు ఇస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలా ఒక్కొక్కరిలో నటులు బయటకువస్తారు. వారి మేనిఫెస్టోల్లో వింత వింత చిట్టాను ఎక్కించేస్తారు.తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కూడా ఇలాంటి ఓ మేనిఫెస్టోను ముందుంచాడు. వచ్చే ఏడాది గోవాలో జరగబోతోన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై సెటైర్లు వేసింది. కస్తూరీ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినీ రాజకీయ క్రీడా విభాగాలపై ఎక్కువ పట్టు ఉన్న కస్తూరీ ప్రతీ అంశం మీద సుధీర్ఘంగా విశ్లేషణ ఇస్తుంటుంది. అనాలిసిస్ చేయడంలో కస్తూరికి ఎక్స్ పీరియన్స్ఉంది. ఆమె స్వతాహాగా న్యాయవాది. అలా సమాజంలోని సమస్యలపైనా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా సీఎం కేజ్రీవాల్ కొన్ని వాగ్దానాలు చేశాడు. గోవాలో కనుక తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హిందువులకు అయోధ్య, క్రిస్టియన్స్‌కు వేలాంకణి, ముస్లింలకు అజ్మీర్ షరిష్, సాయి బాబాను చూడాలనుకునే వారికి షర్డీకి ఉచితంగా పంపిస్తాం. రవాణా సౌకర్యం ఉచితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. దానిపై కస్తూరీ శంకర్ కౌంటర్లు వేసింది. ఆప్ ట్రావెల్స్ అండ్ టూర్స్.. కమింగ్ సూన్.. గోన్ సిక్స్ అమృత్ సర్, జైనులు మౌంట్ అబు, పార్శీలు టెహరాన్.. ఇక నాస్తికులకు గోవాలో కేసినో తరహాలో డబ్బులు ఇస్తాం.. ఆడుకోండి ఎంజాయ్ చేసుకోండి అనే పథకం పెడతారా? అన్నట్టుగా కౌంటర్లు వేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Bz6Dzb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...