గత రెండు రోజుల క్రితం కమల్ హాసన్కు అని తేలిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి భారత్కు చేరుకున్న కమల్కు స్వల్ప కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు కమల్ హాసన్. వైద్యుల సమక్షంలో కారోనా చికిత్స పొందుతూ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో కమల్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఫ్యాన్స్ అంతా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ట్వీట్ పెట్టింది స్టార్ హీరోయిన్ . ''నా తండ్రి ఆరోగ్యం బాగుండాలని మీరంతా చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఆయన రికవర్ అవుతున్నారు. అతిత్వరలో పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తారు'' అని చెబుతూ ట్వీట్ చేసింది శృతి. ఇకపోతే కమల్ హాసన్కి కరోనా అని తెలియడంతో అందరి దృష్టి తమిళ బిగ్ బాస్-5 పై పడింది. ఈ షో హోస్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కమల్ స్థానంలో కొద్దిరోజుల పాటు ఆయన కూతురు శృతి హాసన్ బిగ్ బాస్-5 హోస్ట్గా రానుందనే టాక్ ముదిరింది. ఈ మేరకు షో మేకర్స్ శృతి హాసన్తో సంప్రదింపులు కూడా చేశారని తెలుస్తోంది. గతంలో తెలుగు బిగ్బాస్-4లో ఇదే జరిగింది. షూటింగ్ కారణంగా నాగార్జున హోస్ట్ చేయలేని సందర్భాల్లో రమ్యకృష్ణ, సమంత ఆయన స్థానంలో అలరించారు. సో.. ఇప్పుడు తమిళ బిగ్ బాస్ విషయంలోనూ ఇలాంటి సీన్ రిపీట్ కాబోతోందని చెప్పుకుంటున్నారు జనం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nLsKyv
v
No comments:
Post a Comment