Thursday, 7 October 2021

Prabhas: మనసులో మాట చెప్పిన వైష్ణవ్ తేజ్.. ప్రభాస్, మహేష్ బాబు లాగే అంటూ ఫ్యామిలీ సీక్రెట్ రివీల్!!

‘ఉప్పెన’లా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై.. తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు . మెగా ట్యాగ్ లైన్‌తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమాతోనే తన ట్యాలెంట్ రుజువు చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ సాధించడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ కుర్ర హీరోపై పడింది. ఈ క్రమంలో తన రెండో సినిమా '' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు వైష్ణవ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా మాట్లాడుతూ తన మనసులో మాట బయట పెట్టేశారు. మునుపెన్నడూ లేని విధంగా అటవీ నేపథ్యంలో సాగే నాచురల్ కథతో ఈ 'కొండ పొలం' సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేసింది. కొండకోనల్లో ఆహ్లాదకరమైన లొకేషన్స్ చూపిస్తూ నటీనటులకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చారట క్రిష్. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదగడమే ‘కొండపొలం’ సినిమా కథ. అయితే ఈ మూవీ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ పంచుకున్న వైష్ణవ్.. 'కొండ పొలం' కోసం ప్రత్యేకంగా వర్క్‌ షాప్స్‌ అయితే చేయలేదని, క్రిష్ గైడెన్స్‌తో కొన్ని పదాలు మాత్రం యాసలోనే పలికానని అన్నారు. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు తనకూ అలాంటి కమర్షియల్‌ కథలు చేయాలనిపిస్తుందని చెప్పారు. , అన్నల్లా తనకు కూడా విలన్లను కొట్టాలనిపిస్తుందంటూ మనసులో మాట చెప్పారు. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెండితెరపై తనను అలా చూడటం ఇష్టపడుతున్నారని అన్నారు. ఇలాగే సరికొత్త పాత్రలు చేస్తూ అలరించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. వైష్ణవ్ మాటలను బట్టి చూస్తే ఆయన కమర్షియల్ కథల కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YrfeGc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...