Tuesday, 19 October 2021

పూరి జగన్నాథ్ కొడుకుపై ప్రభాస్ కామెంట్స్.. ఎమోషనల్ అయిన డాషింగ్ డైరెక్టర్! ఆ విషయమై ఓపెన్..

డాషింగ్ డైరెక్టర్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన 'రొమాంటిక్' సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసింది. ఈ సమావేశంలో పూరి జగన్నాథ్, ఛార్మి సహా చిత్ర దర్శకుడు అనిల్ పాదూరి పాల్గొన్నారు. అయితే ట్రైలర్ లాంచ్ అనంతరం ప్రభాస్ మాట్లాడుతుంటే పూరి జగన్నాథ్ ఎమోషనల్ అయ్యారు. 'రొమాంటిక్‌' మూవీ ట్రైలర్‌ నిజంగానే రొమాంటిక్‌గా ఉందని, యాక్టర్‌గా ఆకాష్‌ ఇంప్రూవ్‌ అయ్యాడని, ఇందులో అద్భుతంగా నటించాడని ప్రభాస్ అన్నారు. తన కొడుకుపై ప్రభాస్ ఇలా పాజిటివ్‌గా కామెంట్ చేయడంతో పూరి కాస్త ఎమోషనల్ అయ్యారు. చిత్ర యూనిట్ సమక్షంలో ఆయనలో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఇకపోతే 'రొమాంటిక్‌' సినిమా విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్‌ ఫోన్‌ చేసి అడిగారని, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తా అని ఆయనే స్వయంగా చెప్పారని, అది విని చాలా సంతోషించానని పూరి జగన్నాథ్ అన్నారు. గతంలో పూరి- ప్రభాస్ కాంబోలో ''బుజ్జిగాడు, ఏక్ నిరంజన్'' సినిమాలు వచ్చాయి. అయితే అప్పటినుంచే ప్రభాస్‌కి డార్లింగ్ అనడం అలవాటయిందట. పూరితో పాటు తనతో స్నేహంగా ఉండే ప్రతి ఒక్కరినీ ప్రభాస్ ఇలాగే పిలుస్తారట. పూరి జగన్నాథ్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు ఆయన శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియోలు సినిమాపై ఆసక్తి పెంచేశాయి. తాజాగా ప్రభాస్ సైతం డార్లింగ్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల అభిమానులు కూడా చూడాలని చెప్పడం మరింత బలాన్నిచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3na2eNR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...