Tuesday, 26 October 2021

సమంత కోర్టు కేసుపై సంచలన తీర్పు.. ఇంజెక్షన్ ఆర్డర్‌ పాస్! హీరోయిన్‌ తీరుపై పలు సూచనలు

విడాకుల వ్యవహారం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఆమెపై అప్పుడు మొదలైన రూమర్స్ నేటికీ షికారు చేస్తూనే ఉన్నాయి. చైసామ్ అఫీషియల్‌గా తమ విడాకుల ప్రకటన చేశాక అలాంటి వార్తల్లో వేగం పెరిగింది. సమంత విషయమై పలు యూట్యూబ్ ఛానెల్స్ పెద్ద ఎత్తున గాసిప్స్ ప్రసారం చేయడమే గాక, అభ్యంతరకరమైన థంబ్‌నెయిల్స్ పెట్టాయి. దీంతో సోషల్‌ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కోర్టుకెక్కడం సంచలనంగా మారింది. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీలతో పాటు వెంకట్రావులపై సమంత పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుపై కూకట్‌పల్లి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సమంతకు ఊరటనిస్తూ ఆమె వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, వెంటనే అలాంటి కంటెంట్‌ మొత్తం కూడా తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజెక్షన్ ఆర్డర్‌ పాస్ చేసింది. ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ సమంతకు కోర్టు సూచనలిచ్చింది. ఇటీవలే 'శాకుంతలం' సినిమా కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం విడాకుల తాలూకు జ్ఞాపకాలు మరిచేలా స్నేహితులతో షికారు చేస్తోంది. రీసెంట్‌గా చార్ ధామ్ యాత్ర ఫినిష్ చేసుకొని వచ్చిన ఆమె, హైదరాబాద్ చేరుకొని రెస్ట్ తీసుకుంటోంది. ఇకపై తన పూర్తి శ్రద్ద సినిమాలపైనే పెట్టాలని సమంత డిసైడ్ అయినట్లు టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3md8OnB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...