Wednesday, 1 September 2021

బాలీవుడ్‌లో కరోనా కలకలం.. రెండు డోసులు తీసుకున్న వైరస్ బారినపడ్డ ఫరా ఖాన్

భారతదేశంలో ప్రభావం గత కొద్ది రోజుల నుంచి నిలకడగా ఉంది. చాలావరకూ కేసుల ప్రభావం తగ్గింది. అయితే కొన్ని నెలల ముందు వరకూ పరిస్థితి ఇలా లేదు. సెకండ్ వేవ్ పేరుతో ముంచుకు వచ్చిన ఉపద్రవం ప్రతీ రోజు వేలాది మంది ప్రాణాలు బలిగొంది. ప్రతి రోజు దాదాపు నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో మృతి చెందిన వారి శవాలను దహనం చేసేందుకు స్మశానాల్లో చోటు దొరకని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం.. మళ్లీ కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణంగా నిలిచింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 56 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పంపిణీ జరిగినట్లు వైద్యారోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. కొందరు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని వైద్యాధికారులే చెబుతన్నారు. అయితే ఈసారి కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగానే ఉంది. తాజాగా బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. బాలీవుడ్‌లో ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’ వంటి సూపర్‌‌హిట్ సినిమాలతో ఆమె దర్శకత్వం వహించారు. మరికొన్ని సినిమాల్లో ఆమె నటించారు, కొరియోగ్రాఫీ కూడా అందించారు. అయితే తాజాగా ఫరా కరోనావైరస్ బారినపడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నటిప్పికీ.. ఆమెకు వైరస్ సోకింది. తాను వైరస్ బారినపడినట్లు ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు.. ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి అంటూ ఆమె అభిమానులను కోరారు. ఫరా త్వరగా వైరస్ నుంచి కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38tWWpo
v

No comments:

Post a Comment