మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తన ప్యానెల్ను ప్రకటించిన తరువాత అసలు కథ మొదలైంది. ఇంత వరకు ప్రకాష్ రాజ్ మాత్రం బాణాలు సంధించారు. ఇక ఇప్పటి నుంచి విష్ణు ప్యానెల్ కూడా రెడీ అయింది. కాసేపటి క్రితమే మీడియా ముందుకు విష్ణు ప్యానెల్ వచ్చింది. ఇందులో విష్ణు మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు. ఇండస్ట్రీ రెండు విడిపోయిందని చెప్పేశాడు. బాహాటంగా మద్దతు ప్రకటించేందుకు ఎంతో మంది భయపడుతున్నారని అన్నాడు. తనకు తెలిసిన పీఆర్వోలు, తన వల్ల ఎదిగిన పీఆర్వోలే తనకు మద్దతు తెలపడం లేదని, వారు కూడా భయపడుతున్నారంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక ఓ సీనియర్ నటుడు అయితే నాకు సపోర్ట్ ఇస్తాను అన్నాడు.. ఓటు వేస్తాను అన్నాడు. కానీ బయటకు వచ్చి బైట్ మాత్రం ఇవ్వమని అడగొద్దు అన్నాడట. అలా ఆ స్థాయిలో భయాలు పెరిగాయని మంచు విష్ణు ఉదాహరణలు చెప్పాడు. ఇక ఓ జాతీయ మీడియాలో వచ్చిన తన మీద, తన తండ్రి మీద వచ్చిన ఆర్టికల్లో ఓ తప్పు ఉందని మంచు విష్ణు దాన్ని కరెక్ట్ చేశాడు. మా నాన్న చెబితే.. నేను పోటీకి దిగలేదు. కొందరు పెద్దలు నన్ను అడిగితే.. అది మా నాన్నకు చెబితే.. ఓకే అన్నారు. అప్పుడు నేను పోటీలోకి దిగాను. అయితే ఓ పెద్ద స్టార్ మాత్రం మా నాన్నకు ఫోన్ చేసి.. విష్ణును పోటీ నుంచి తప్పుకోమని చెప్పు అని అన్నాడు. అంత వరకు ఆయన నా పోటీ విషయంలో తలదూర్చలేదు. కానీ ఆయన ఆ మాట అనడంతో.. దాదాపు ఆరేడు వందల మందికి ఫోన్ చేసి విష్ణు పోటీలో ఉంటున్నాడు.. సపోర్ట్ చేయమని అడిగాడు అంటూ అందరి ముందే గుట్టంతా విప్పేశాడు విష్ణు. అయితే మోహన్ బాబుకు ఫోన్ చేసింది చిరంజీవేనా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39wxccN
v
No comments:
Post a Comment