Saturday, 25 September 2021

షూటింగ్ గ్యాప్‌లో బోరింగ్.. బుంగమూతి పెట్టుకున్న రష్మిక మందన్నా

ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. ఈ ఏడాది కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక బాలీవుడ్‌లో అయితే వరుసగా రెండు మూడు సినిమాలను చేస్తోంది. ఒక చిత్రం విడుదల కాకముందే బాలీవుడ్‌లో రెండో ప్రాజెక్ట్‌ను కూడా చేపట్టింది. అలా రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మిక ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మిక తన అభిమానులకు అందుబాటులో ఉంటూ అలరిస్తూ ఉంటుంది. రష్మిక ఇప్పుడు తెలుగులో రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతోన్న పుష్ప చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకు వదిలిన చిన్నపాటి టీజర్‌లోనే రష్మిక లుక్కు అదిరిపోయింది. ఇక శ్రీవల్లి అంటూ ఏకంగా రష్మిక మీదే ఓ పాట ఉందట. అది ఓ రేంజ్‌లో ఉండబోతోందని టాక్. ఇక హీరోగా రాబోతోన్న అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు అనే షూటింగ్‌లోనే ఉంది. అయితే షూటింగ్ సమయంలో ఆమెకు కాస్త బోర్ కొట్టినట్టుంది. తన షాట్స్ మధ్యలో ఇలా బోర్ కొడుతోందంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఉంది. బుంగమూతి పెట్టుకున్న రష్మిక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక శర్వానంద్ అయితే ప్రస్తుతం మహాసముద్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3COAAMr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...