రీసెంట్గా జరిగిన 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్తో మాట్లాడిన మాటలు, ఏపీ ప్రభుత్వం మీద చేసిన విమర్శలు, ముఖ్యమంత్రి, మంత్రుల మీద వాడిన పదజాలం సంచలనంగా మారింది. ఈ ఇష్యూపై వైసీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై కౌంటర్లు వేశారు టాలీవుడ్ నటుడు, రచయిత . పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారని చెప్పిన పోసాని.. సినిమా ఈవెంట్కు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఏంటి? ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ''ప్రజారాజ్యం పార్టీలోకి చిరంజీవి నన్ను ఆహ్వానించినప్పుడు మీడియాతో లైవ్ మీట్ పెట్టారు. అరగంట లైవ్ అది. ఆ కార్యక్రమం కాస్త గంటన్నరగా మారింది. అప్పుడు జనం నాపై ఎగబడి పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి రకరకాల పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ను కాపాడుకుంటూ, ఆయన వైవాహిక జీవితం గురించి ఆచితూచి మాట్లాడాను. అప్పుడు అది నా బాధ్యత. ఆ లైవ్ అయిపోగానే సాయిధరమ్ తేజ్ తల్లి ఫోన్ చేసి ఎన్నికల సమయంలో మా ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. మీరు బాగా గొప్పగా మాట్లాడారు అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇల్లాలు కూడా ఫోన్ చేశారు. మురళీ గారు మీరు మాట్లాడుతుంటే.. టీవీ ముందు పవన్ కళ్యాణ్ టెన్షన్ పడుతున్నారు. కానీ నోరు జారకుండా ఒక్క మాట కూడా అనకుండా కాపాడారు. థాంక్యూ వెరీ మచ్ మురళీ గారు అని అన్నారు. ఆ సమయంలో అది నా బాధ్యత. ఇవ్వాళ అదే బాధ్యతతో మెలగమంటున్నా. నువ్వు మంచి చెబితే మంచి రాస్తారు. చెడు చెబితే చెడుగానే రాస్తారు. పవన్ కళ్యాణ్కి రాజకీయంగా స్థిరత్వం లేదు. ఆయన తప్పు చేస్తున్నారు'' అంటూ గత విషయాలు ప్రస్తావిస్తూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m42u0q
v
No comments:
Post a Comment