పీపుల్స్ స్టార్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం 'రైతన్న' ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేటి రైతు పరిస్థితి గురించి ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన నారాయణ మూర్తి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకం చాలా అద్భుతమైనదని చెప్పిన నారాయణ మూర్తి.. ఈ పథకం అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తున్నారని కొనియడారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు వరాలు కావని, శాపాలుగా మారబోతున్నాయని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేశారు. గత ఎనిమిది నెలలుగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారత దేశానికి అంత మంచివి కావంటూ ఓపెన్ అయ్యారు. ఓ వైపు కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే రైతాంగం మాత్రమే ధైర్యంగా వ్యవసాయం చేసి దేశానికి ఆహరం అందించిందని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే ఈ దేశంలో కూడా రైతు కూలీలే మిగులుతారని, స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను పక్కనపెట్టి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని నారాయణ మూర్తి కోరారు. 'అర్ధరాత్రి స్వాతంత్రం' నుంచి మొదలుకొని అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని, 37వ సినిమా ఈ 'రైతన్న' విడుదల చేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 'రైతన్న' సినిమాను అందరూ ఆదరించాలని ఆయన కోరారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xAhfvC
v
No comments:
Post a Comment