Monday, 2 August 2021

లేటైనా ఏం కాదు.. దేశానికి మాత్రం దానితోనే రండి.. షారుఖ్ ఖాన్ లేటెస్ట్ ట్వీట్

మొన్న మీరాభాయ్ చాను.. నిన్న పీవీ సింధు.. లేటెస్ట్‌గా భారత మహిళల హాకీ జట్టు.. ఇలా ఒలింపిక్స్‌లో భారత మహిళలు తన హవాను కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో ప్రదర్శన చేస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయ్ చాను తొలి పతకం సాధించగా (రజతం). బ్యాడ్మింటన్‌లో మంచి పోరాటపటిమ చూపించి సెమీ ఫైనల్‌లో ఓటమిపాలై.. ఆ తర్వాత జరిగిన మరో మ్యాచ్‌లో విజయం సాధించి సింధు కాంస్య పతకం సాధించింది. తాజాగా భారత మహిళల హాకీ జట్టు కూడా అద్భుత పదర్శన చేసి.. ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌కి చేరింది. సోమవారం ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో ఒక గోల్ సాధించిన భారత్ ఆ తర్వాత ఆస్ట్రేలియా అమ్మాయిలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఆరంభంలోనే వచ్చిన ఆధిక్యాన్ని అలాగే చివరి వరకూ నిలుపుకొని విజయలక్ష్మిని తన సొంతం చేసుకుంది. అయితే భారత మహిళల విజయంపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ బాద్‌షా కూడా దీనిపై స్పందించారు. భారత మహిళల హాకీ జట్టు కోసం.. ఈ మ్యాచ్ విజయం తర్వాత జట్టు కోచ్ కోచ్ సోయెర్డ్‌ మ‌రీన్‌ ఓ సెల్ఫీ పోస్ట్ చేశారు. దీనికి ‘నన్ను క్షమించండి.. ఇంటికి రావడం ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉంది’ అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. దీన్ని రీ ట్వీట్ చేసిన షారుఖ్.. ‘ఆలస్యం అయిన ఫర్వాలేదు.. కొన్ని కోట్లాది మంది కోసం స్వర్ణంతో రండి.. ఎలాగు థన్‌తేరాస్ ‘నవంబర్ 2న’ ఉంది. మీ ఎక్స్ కోచ్.. కబీర్ ఖాన్’ అంటూ తన చెక్‌దే ఇండియా సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37cvfks
v

No comments:

Post a Comment