Sunday, 29 August 2021

ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. నటుడు అర్మాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

సినిమా తారలను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్లు చేసుకున్నట్లుగా హెయిర్ స్టైల్.. వాళ్లు వేసుకున్నట్లుగా డ్రెస్సింగ్ స్టై‌ల్‌ని ఫాలో అవుతుంటారు. మరి అలా అభిమానులకు ఆదర్శంగా నిలిచే సినిమా తారలే పక్కదోవ పడితే.. అభిమానులు కూడా అదే రూట్‌లో వెళ్లే అవకాశం ఉంది. అలా ఇప్పుడు యావత్ భారత దేశ సినీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య డ్రగ్స్. నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదు అయింది. తాజాగా టాలీవుడ్‌కి సంబంధించి ఈ కేసుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరీ (ఈడీ) తన హస్తగతం చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వాళ్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరందరూ విచారణకు రావాలని ఈడీ పేర్కొంది. ఇక ఇప్పటికే.. శాండిల్‌పుడ్‌లో నటి సంజనా.. నటి రాగిణి ద్వివేది డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లివచ్చారు. త్వరలో వీరిపై మరోసారి విచారణ జరుగనుంది. దీని తర్వాత ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇక తాజాగా డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన డ్రగ్స్ డీలర్ అజయ్ రాజు సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి కావాల్సినంత సమాచారం రాబట్టారు. ఇందులో నటుడు అర్మాన్ కహ్లీ పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో ముంబైలోని ఆయన స్వగృహంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని గంటల తర్వాత అన్ని అదుపులోకి తీసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gIlOOS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...