Wednesday, 11 August 2021

ఆ రూపంలో చావును దగ్గరగా చూశా.. కారు, బంగ్లా అవసరం లేదన్న కస్తూరి! టెన్షన్ పడ్డానంటూ కంటతడి

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన .. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తోంది. 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సీరియల్‌లో నటిస్తూ నిత్యం ప్రతి తెలుగింటి గడప తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న సిక్త్ సెన్స్ ప్రోగ్రాంకి గెస్టుగా వచ్చిన ఆమె.. తన లైఫ్‌లో చోటుచేసుకున్న చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. సాధారణంగా కస్తూరి సోషల్ మీడియాలో ఎంతగా కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సమాజంలోని ప్రతీ విషయం మీద స్పందిస్తూ ఆమె చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. అయితే ఆమె లైఫ్‌లో మాత్రం కూతురు ఆరోగ్యం విషయమై ఎన్నో కష్టాలు అనుభవించింది కస్తూరి. చాలా డిప్రెషన్‌కి లోనయింది. గతంలోనే పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆమె.. మరోసారి సిక్త్ సెన్స్ ప్రోగ్రాంలో అవన్నీ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. తన కూతురి గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. తన కూతురు లుకేమియా వ్యాధితో బాధపడిందని, ఆ సమయంలో మూడేళ్ళ పాటు కంటి మీద కునుకు లేకుండా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పుకొచ్చింది. కూతురు ఆసుపత్రిలో ఉన్న ఆ మూడేళ్లు పడిన టెన్షన్ మాటల్లో చెప్పలేనని అంటూ కంటతడి పెట్టుకుంది. కనీసం తన బాబును కూడా పట్టించుకోలేని పరిస్థితి అంటూ ఎమోషనల్ అయింది. మూడు సార్లు చావును దగ్గరగా చూశానని.. తన తల్లిదండ్రుల తర్వాత తన కూతురును చూసి ఏడుపొచ్చిందని తెలిపింది. చివరకు తన కూతురు గెలిచిందని కస్తూరి చెప్పింది. అయితే కూతురు అనారోగ్యంతో ఉన్న ఆ మూడు సంవత్సరాల్లో తాను చాలా నేర్చుకున్నానని కస్తూరి చెప్పింది. తనకు కారు, బంగ్లా లాంటివి అవసరం లేదని, ప్రస్తుతం తన కూతురు లాగే లుకేమియాతో ఎవరైనా బాధ పడుతున్నారంటే వారికి తాను పెట్టిన ఓ ట్రస్ట్ ద్వారా కావాల్సిన సాయం అందిస్తున్నానని ఆమె తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CFTwxG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...