Thursday, 12 August 2021

ఆ వ్యాధితో బాధ పడుతున్న యంగ్ హీరోయిన్.. భయం వెంటాడుతోందంటూ గుట్టువిప్పిన లావణ్య త్రిపాఠి

అందరి లాగే సెలబ్రిటీలకూ కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి. అన్ని సందర్భాల్లో కాకపోయినా ఏదో ఒక సమయంలో వాటిని బయటపెడుతుంటారు నటీనటులు. ఈ రోజుల్లో సోషల్ మీడియా హవా మరింత పెరగడంతో తమ తమ వ్యక్తిగత విషయాలను ఆ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి తన పర్సనల్ విషయాన్ని బయటపెట్టింది. తనలో ఓ రకమైన భయం ఉందంటూ ఓపెన్ అయింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి అభిమానులతో ముచ్చటిస్తూ.. నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలపై రియాక్ట్ అయింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సక్రమంగా ఉంటుందని చెప్పిన ఆమె.. తనకు సమస్య ఉందని చెప్పుకొచ్చింది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే భయం పుడుతుందని, చాలా రోజులుగా ఈ ఫోబియాతో బాధ పడుతున్నానని, దీని నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానంటూ సీక్రెట్ రివీల్ చేసింది. తాను నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుతం తను స్వల్ప విరామం తీసుకోవాలనుకుంటున్నట్లుగా ఆమె పేర్కొంది. త్వరలోనే మంచి కథతో మీ ముందుకు రాబోతున్నానని, సెలెక్టెడ్ సినిమాలు ఎంచుకుంటున్నానని తెలిపింది. 'అందాల రాక్షసి' తెలుగు తెరపై కాలుమోపిన లావణ్య.. అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్‌తో టచ్ లోకి వస్తోంది. ''A1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా'' సినిమాలతో ఆకట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jNL8Uj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...