Wednesday, 14 July 2021

వాళ్లిద్దరూ టవల్ కట్టుకొని ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చారు.. అప్పటి విషయాలను బయటపెట్టిన రోజా రమణి

సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, హీరో తరుణ్ తల్లి రోజా రమణి తన భర్త చక్రపాణితో కలిసి '' ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమ లైఫ్, వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అవుతూ ఆలీతో చాలా విషయాలు పంచుకున్నారు. జులై 19వ తేదీన ప్రసారం కాబోతున్న ఈ షో తాలూకు ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో తమ జ్ఞాపకాలను, తీపి గుర్తులను రోజా రమణి వెల్లడించారు. గెస్ట్ ఎవ్వరైనా సరే సరదాగా మాట్లాడుతూ.. వారి వారి వ్యక్తిగత విషయాలతో పాటు జీవితంలో జరిగిన మరపురాని సంఘటనల గురించిన విషయాలు బయటకు తీస్తుంటారు ఆలీ. ఈ ప్రోగ్రాంలో కూడా రోజా రమణితో మాట్లాడుతూ ఒకప్పటి విషయాలను వెలికి తీశారు. రోజా రమణి దంపతులకు అక్కా బావ అంటూ స్వాగతం పలికిన ఆయన.. వాళ్ళిద్దరిపై సరదాగా పంచులేస్తూ చాలా విషయాలు ప్రస్తావించారు. అయితే తాము స్విజ్జర్లాండ్‌లో ఉన్నప్పుడు ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో ఇంట్లో తండ్రీ కొడుకులిద్దరూ (తరుణ్, చక్రపాణి) టవల్ కట్టుకొని పూజలు చేస్తున్నారని రోజా రమణి చెప్పారు. భక్తి భావంలో మునిగిపోయి ఇండియా నుంచి తెచ్చిన అగరవత్తులు, కర్పూరం కడ్డీలు బాగా వెలిగించడంతో స్మోక్ డిటెక్టర్ ద్వారా తెలుసుకొని పోలీసులు అక్కడికి వచ్చారని చెప్పిన ఆమె.. తండ్రీ కొడుకులిద్దరికీ భక్తి భావాలు చాలా ఎక్కువే అని తెలిపారు. ఇక తన చిన్నతనంలోని సీక్రెట్ కూడా బయటపెట్టారు రోజా రమణి. తనకు పౌడర్ తినే అలవాటు ఉందంటూ ఓపెన్ అయ్యారు. ఇకపోతే తమ కుటుంబానికి రామోజీరావుతో మంచి అనుబంధం ఉందని చెప్పారు రోజా రమణి దంపతులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i5EjwI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...