Tuesday, 20 July 2021

థియేటర్ ఓనర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్! కొత్త రూల్.. కానీ, వీళ్లకి మాత్రం కాదు

సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో సినిమా థియేటర్‌లలో మళ్లీ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. అయితే, మల్టీప్లెక్స్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల విషయంలో మాత్రం పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు మామూలు థియేటర్లకు పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకనుంచి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం వారి హాల్స్‌లో సినిమాకు వచ్చే ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయనున్నాయి. 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సముదాయాల విషయంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. చాలామంది సినిమా థియేటర్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం, పర్యవేక్షణ లేకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. థియేటర్ల వద్ద నిలిపి ఉంచే వాహనాలకు నిర్ణీత రుసుము వసూలు చేసి వాటి పర్యవేక్షించాల్సిందిగా నిర్వహకులను ఆదేశించింది. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు సినిమా థియేటర్ల అసోసియేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణ అంతటా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభం కానున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rlcB2Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...