Sunday, 11 July 2021

బోనాల పండగ: తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అంటూ ఆడపడుచులకు చిరంజీవి విషెస్

తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల సందడి షురూ అయింది. ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండగను గతేడాది కరోనా కారణంగా ఇళ్లలోనే జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఆదివారం గోల్కొండ కోట లోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రమంతటా ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో మెగాస్టార్‌ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి. ఈ మేరకు ఆడపడుచులు బోనం ఎత్తుకున్న ఫొటో షేర్ చేశారు. చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే మలయాళ మూవీ 'లూసిఫర్‌' తెలుగు రీమేక్ సెట్స్ మీదకు రానున్నారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kanao3
v

No comments:

Post a Comment