Sunday, 18 July 2021

‘కర్ణన్’కు బ్లాక్ బస్టర్ టాక్.. ధనుష్ నిర్మాతకు కోట్లలో నష్టం!

కోలీవుడ్‌లో ప్రస్తుతం హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కథకు, పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకుంటున్నారు. అలా ధనుష్ తన నటనతో కోలీవుడ్, సౌత్ దాటి పోయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. ధనుష్ హాలీవుడ్‌లోనూ నటిస్తున్నారు. అయితే ధనుష్ సినిమాకు టాక్ బాగానే వచ్చిన కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదట. కర్ణన్ సినిమా ఫలితమే ఇలా నారప్పను ఓటీటీ వరకు తీసుకొచ్చిందట. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటపెడుతున్నారు. సురేష్ బాబు ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జూలై 20న అమెజాన్‌లో ఈ మూవీ అందుబాటులోకి రాబోతోంది. నారప్పను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు అందరూ బాధపడుతున్నారు. ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అటు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో సురేష్ బాబు క్లియర్‌గా వివరించారు. కలైపులి థాను కర్ణన్ సినిమా విడుదల చేశారు.. మొదటి వారం బాగా ఆడింది.. అప్పటికే సెకండ్ వేవ్ వచ్చేసింది. రెండో వారం యాభై శాతం ఆక్యుపెన్సీతో నడపించారు. ఇక మూడో వారం థియేటర్లనే మూసేశారు. ఇలా అనుకున్న దాని కంటే ఓ పది, పదిహేను కోట్లు నష్టపోయారు. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందేమోనని ఆయన భయపడ్డారట. ఈ డీల్ కుదర్చడం వెనకాల కూడా ఆయనే ముందున్నారట. అందుకే ఇలా నారప్పను నేరుగా ఓటీటీలోకే వదులుతున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికి కర్ణన్ దెబ్బ నారప్ప మీద పడినట్టు అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hMGlCV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...