Wednesday, 28 July 2021

నటించడం కంటే ఆ పనే కష్టం.. కొత్త అవతారం ఎత్తిన తేజస్వీ మడివాడ!

నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈమె కెరీర్ బిగ్ బాస్ షోకు ముందు ఆ తరువాత అనేలా మారిపోయింది. బిగ్ బాస్ షో కంటే ముందు ఆమెకు విపరీతమైన ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా, సహాయక పాత్రల్లోనూ నటించారు. అయితే బిగ్ బాస్ తరువాత ఆమె కెరీర్ మొత్తం డౌన్ అయిపోయింది. బిగ్ బాస్ షో తరువాత ఇంత వరకు ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఆ మధ్య కమిట్మెంట్ అనే సినిమాతో హల్చల్ చేసింది. కానీ విడుదల కాకముందే ఆ ప్రాజెక్ట్ పత్తా లేకుండాపోయింది. ఎప్పటికప్పుడు ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. ఇప్పుడు ఎక్కడా కూడా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వినబడటం లేదు. తన రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలే ఇందులో ఉన్నాయని, ప్రతీ ఒక్క అమ్మాయి చూడవల్సిన సినిమా అని సినిమా ప్రమోషన్స్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వీ ఇప్పుడు కొత్త అవతారాన్ని ఎత్తేశారు. నటిగా అవకాశాలు తక్కువ అవడంతో ఆమె సహాయక దర్శకురాలిగా మారినట్టున్నారు. ప్రస్తుతం అనీష్ కురివిల్లా దర్శకత్వంలో రాబోతోన్న ఓ వెబ్ సిరీస్ కోసం తేజస్వీ సహాయ దర్శకురాలిగా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. నటిగా ఉంటే కేవలం నటన మీదే ధ్యాస ఉంటుందని, కానీ ఏడీగా పని చేయడంతో సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంపై అవగాహన ఏర్పడుతోందని అన్నారు. నటిగా కంటే ఏడీగానే ఎక్కువ కష్టం, బాధ్యత, పని ఉంటుదని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V1kIGa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...