Tuesday, 13 July 2021

Arjun Kapoor: అలా పిలవమని జాన్వీతో ఎప్పుడూ చెప్పలేదు.. ఆ మాట విని ఎమోషనల్ అయ్యా..

శ్రీదేవి మరణించిన తర్వాత , ఖుషీ కపూర్‌లకు దగ్గరయ్యారు బోనీ కపూర్‌ మాజీ భార్య మోనా శౌరీ పిల్లలు అర్జున్‌ కపూర్, అన్షులాలు. శ్రీదేవి మరణానికి ముందు జాన్వీ కపూర్, కుషీ కపూర్ అంటే కుటుంబానికి చెప్పలేనంత అయిష్టత ఉండేది. కానీ క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. వాళ్ళతో అర్జున్ కపూర్‌కు ఉన్న అంతరాలు తొలిగిపోయాయి. దీంతో కొన్నేళ్లుగా చెల్లెళ్లద్దరిపై అన్న ప్రేమను పంచుతున్నారు అర్జున్ కపూర్. ఈ నేపథ్యంలోనే తాజాగా జాన్వీ కపూర్‌ తనను ఎలా పిలుస్తుందో తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు అర్జున్. క్లబ్‌హౌస్ యాప్‌లో ది బాలీవుడ్ ఫిల్మ్ క్లబ్‌లో ముచ్చటిస్తున్న సమయంలో తనను 'అర్జున్ భయ్యా' అంటూ జాన్వీ కపూర్ పిలవగానే భావోద్వేగానికి లోనయ్యానని అర్జున్ కపూర్ తెలిపారు. తన సోదరి అన్షులా కపూర్ తనను భయ్యా అంటుందని, కానీ జాన్వీ ‘అర్జున్‌ భయ్యా’ అంటుందని చెప్పిన అర్జున్ కపూర్.. ఎందుకో జాన్వీ అలా పిలిస్తే చాలా విచిత్రంగా, కొత్తగా అనిపిస్తుందని అన్నారు. అర్జున్ భయ్యా అని పిలవడంతో తనలో ఒక రకమైన పులకింత కలిగిందని అర్జున్ కపూర్ అన్నారు. నిజానికి తనను అలా పిలవమని, ఎప్పుడూ చెప్పలేదు కానీ.. జాన్వీకి ఎలా నచ్చితే అలాగే పిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జాన్వీ నోటివెంట అలా సహజసిద్ధంగా రావడంతో చాలా సంతోషం కలిగిందని తెలిపారు. తమవి ఇప్పటికి వేర్వేరు ఫ్యామిలీలే అని చెప్పిన అర్జున్.. చాలా రోజులుగా కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా తాము ఎదురు పడ్డప్పుడు తమ మధ్య మంచి అనుబంధాలు కనిపిస్తాయి కానీ తమది పరిపూర్ణ కుటుంబం అని అబద్ధం మాత్రం చెప్పనని అర్జున్ కపూర్ చెప్పడం విశేషం. మెల్లగా అంతా కలిసిపోతామని, దానికి కాస్త సమయం పడుతుందని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3karV0O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...