బాలీవుడ్ ప్రముఖ నటుడు (98) ఆస్పత్రిలో చేరారు. సాధారణ చెకప్ కోసం ప్రతీ నెలా ఆయన హాస్పిటల్కు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంలో ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతోన్న దిలీప్ కుమార్ను ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆయన భార్య సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం గురించి స్పందించారు. ఉదయాన్నే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఉదయం 8 30గంటలకు ఖార్ రోడ్డులో ఉన్న హాస్పిటల్కు తీసుకొచ్చాం. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.. కొన్ని పరీక్షలు చేశారు.. మేం వాటి రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి అని సైరా భాను వేడుకున్నారు హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం సీనియర్ డాక్టర్లు కార్డియాలజిస్ట్ నితిన్ గొఖలే, పుల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్కర్ పర్యవేక్షణలో ఉన్నారు. ఇక దిలీప్ కుమార్ కెరీర్ విషయానికొస్తే.. 1944లో ఆయన మొదటిసారి జ్వార్ భాతా సినిమాతో వెండితెరకు పరిచయమై దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దిలీప్ కుమార్ అసలు పేరు.. మహమ్మద్ యూసుఫ్ ఖాన్. భారత దేశం గర్వించదగ్గ నటుడు చివరగా హీరోగా కిలా సినిమాలో కనిపించారు. ఆ చిత్రం 1998లో విడుదలైంది. ఆ తరువాత సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. కరోనా కారణంగా ఆయన సోదరలిద్దరూ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cnA4dB
v
No comments:
Post a Comment