నైరాషా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. తన పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని జుహులోని లగ్జరీ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ఆశిక్ సాజిద్ హుస్సేన్తో కలిసి పార్టీ చేసుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి గంజాయి సేవించింది నైరానా. కాగా ఆదివారం తెల్లవారు జామున నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీ బీ) నైరా షా ఉన్న హోటల్ గదిపై దాడి చేయగా.. మాదకద్రవ్యాలు సేవించినట్టు తేలడంతో వారిద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హోటల్ గదిలో సోదాలు నిర్వహించగా.. ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి సిగరెట్లో చుట్టబడి ఉన్నట్టుగా పోలీసులు సోదాల్లో వెల్లడైంది. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో హోటల్ గదిపై ఎన్ సీ బీ అధికారులు దాడి చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా నైరా షాతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆశిక్ సాజిద్ హుస్సేన్ మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి నేషనల్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ పదార్థాల చట్టం ఐపిసి సెక్షన్ 274 కింద కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన తరువాత కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే వారు డ్రగ్స్ సేవించినట్టుగా రిపోర్ట్ వచ్చాయి. అయితే అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరు సప్లై చేశారో నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2019లో ఆది హీరోగా నటించిన ‘బుర్రకథ’ సినిమాలో హీరోయిన్ నటించింది నైరా షా. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తిరిగి ముంబై చెక్కేసి.. హో గయా టోటల్ సిపాయా, మిరుగా వంటి చిత్రాల్లో నటించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vBtJSU
v
No comments:
Post a Comment