Saturday, 19 June 2021

జగమే తంత్రం రివ్యూ

సినిమాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా అంచనాలు ఏర్పడుతున్నాయి. కొత్త కాన్సెప్ట్‌‌లను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ చేసిన సినిమా మీద భారీ బజ్ నెలకొంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల ఆలస్యమైంది. చివరకు ఓటీటీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్‌లో జగమే తంత్రం అందుబాటులో ఉంది. ఈ మూవీ ఎలా ఉందో, ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం. కథ జగమే తంత్రం కథ లండన్ నేపథ్యంలో జరుగుతుంది. కథ అక్కడ జరిగినా దాని మూలం మాత్రం తమిళనాడు, శ్రీలంకలో ఉంటుంది. శ్రీలంకలోని తమిళ శరణార్థులు లండన్‌కు వసల వెళ్తుంటారు. అయితే అక్కడ కూడా వారిపై వివక్షను చూపుతుంటారు. అలాంటి శరణార్థుల కోసం లండన్‌లో శివ దాస్ (జోసెఫ్ జార్జ్) పోరాడుతుంటారు. కానీ అది నచ్చని పీటర్ (జేమ్స్ కాస్మో) శివ దాస్ కథను ముగించేందుకు సురుళి (ధనుష్)ని రంగంలోకి దించుతాడు. అసలు సురుళి కథ ఏంటి? ఎక్కడో మధురైలో ఉండే సురుళి లండన్‌కు వచ్చాక ఏం చేస్తాడు? చివరకు సురుళి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? చివరకు ఏం చేస్తాడు? అనేది కథ. నటీనటులు జగమే తంత్రం సినిమా మొత్తం సురుళి చుట్టే తిరుగుతుంది. డబ్బు కోసం ఏ పనైనా చేసే పాత్రలో ధనుష్ అందరినీ మెప్పిస్తారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ ఇలా ప్రతీ సీన్‌లో ధనుష్ తన మార్క్‌ను చూపించారు. ఇక ఈ కథలో ముఖ్యంగా పీటర్, శివదాస్ గ్యాంగ్‌ల నేపథ్యంలో జరుగుతుంది. పీటర్ పాత్రలో జేమ్స్ కాస్కో, శివ దాస్ క్యారెక్టర్‌లో జోసెఫ్ జార్జ్ అదరగొట్టేశారు. అథిలా పాత్రలో హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ కనిపించినంతలో మెప్పించారు. ఇక మిగిలిన పాత్రలో అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ శరణార్థులు, వారి కోసం పోరాడే నాయకుడు, గ్యాంగ్ స్టర్ కథలు ఇలా ఇప్పటికే ఎన్నో చూసి ఉన్నాం. జగమే తంత్రం కూడా కొత్త కథేమీ కాదు. కానీ ఎంచుకున్న పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ శరణార్థులు అంటూ అల్లుకున్న పాయింట్ అందరినీ ఆకట్టుకుంటుంది. కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న కథనం బాగానే ఉన్నా.. అందులో ఎక్కడా కొత్తదనం కనిపించదు. పైగా సినిమా అంతా కూడా బోరింగ్ అనిపించేలా సాగుతుంది. మరీ ముఖ్యంగా ద్వితీయార్థం మరింత అసహనానికి గురి చేస్తుంటుంది. శివదాస్ అనంతరం సినిమా మరింత నిరాసక్తంగా సాగుతుంది. హీరో అయిన సురుళి ఏం చేస్తున్నాడు? కథనం ఎటు వెళ్తుందో కూడా అర్థం కాదు. సురుళి మీద అటాక్ జరిగిన తరువాత అయినా కథనం మరింత వేగంగా సాగుతుందని ఆశిస్తే అక్కడా నిరాశే ఎదురవుతుంది. ఇక చివర్లో పీటర్‌ను అంత ఈజీగా అటాక్ చేయడం నమ్మశక్యంగా అనిపించదు. అయితే చివర్లో పీటర్‌ను ప్రాణాలతో వదిలిపెట్టి ఓ శరణార్థిగా ఏదో ఓ మూలన పడేయడం కాస్త కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. గ్యాంగ్ వార్, నమ్మకద్రోహం వంటి కాన్సెప్ట్‌లతో కుప్పలు కుప్పలుగా సీన్స్ ఉన్నాయి. ఇందులోనూ అవే కనిపిస్తాయి. కార్తీక్ సుబ్బరాజు కూడా కొత్తగా ఆలోచించలేకపోయారు. అలా అన్నీ కలిసి జగమే తంత్రం ఓ సాధారణ ప్రయత్నంగా మారింది. సంగీతం కూడా ఏమంత ఆకట్టుకోదు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం కూడా నచ్చకపోవచ్చు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. చివరగా.. ‘జగమే తంత్రం’ వేసిన మంత్రం ప్రేక్షకుల మీద పని చేయలేదు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Uiqdjf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...