Monday, 14 June 2021

మీ ప్రశంసలు నాకెంతో బలాన్ని ఇస్తున్నాయ్.. గవర్నర్ ప్రశంసలపై చిరు

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ సతీసమేతంగా రక్తాన్ని దానం చేశారు. ఈ మేరకు చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తాన్ని దానం చేస్తున్న అందరికీ.. మరీ ముఖ్యంగా నా బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి థ్యాంక్స్. వారంతా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతారు. ఇలా ఎంతో చిన్న పనితో కొందరి విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. రక్తాన్ని దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అని చిరంజీవి పిలుపునిచ్చారు. అలా చిరంజీవి చేసిన పోస్ట్ మీద గవర్నర్ స్పందించారు. అనిర్వచనీయమైన సేవలు, ప్రాణవాయువు అందిస్తూ ప్రాణదాతగా చిరంజీవి చేస్తోన్న సేవలు ఎంతో గొప్పవి. రక్తదాతలు ప్రాణాన్ని కాపాడేవారంటూ చిరంజీవి సేవా కార్యక్రమాలపై తమిళిసై స్పందించారు. ఇక తమిళిసై చేసిన పోస్ట్ మీద చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మీ మాటలు మమల్ని ఎంతో ఎంకరేజ్ చేసేలా ఉన్నాయ్ మేడమ్.. మీ ప్రశంసలు నన్ను ఇంకా ఎంతో కష్టపడేలా చేస్తున్నాయి.. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేలా ముందుకు తోస్తున్నాయ్.. థ్యాంక్యూ మేడమ్ అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vnAUhg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...