Wednesday, 23 June 2021

ఒరేయ్ పిచ్చినా కొ**ల్లారా నేను ఇసుక అమ్ముకుని కోట్లు సంపాదించానా?: మురళీమోహన్

నటుడిగా ఇండస్ట్రీలో మచ్చలేని మనిషిగా ఉన్న సీనియర్ నటుడు .. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి రాజకీయాల్లోకి వచ్చి తప్పుచేశానంటూ పశ్చాత్తాప పడ్డారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది రాజకీయాల్లోకి రావడమే అని అన్న ఆయన.. తనకు ఇష్టం లేదని చెప్పినా చంద్రబాబు కన్వెన్స్ చేసి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని.. ఆ పదేళ్ల టైంలో చాలా కోల్పోయని, రాజకీయాలంటే విరక్తి కలిగేలా చేశారంటూ ఎన్నికల తరువాత హాట్ కామెంట్ చేశారు మురళీమోహన్. తాజాగా ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోలో తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. ‘నేను రాజమండ్రి ఎంపీగా ఉండగా.. ప్రతిపక్షం వాళ్లు ఎంపీ మురళీ మోహన్ రాజమండ్రి గోదావరిలోని ఇసుక మొత్తాన్ని అమ్మేసి కోట్లకి కోట్టు సంపాదిస్తున్నారని అన్నారు. ఓరి పిచ్చ నా కొడకల్లారా నా ఇల్లుకి కావాల్సిన ఇసుక కూడా బయట మార్కెట్‌లో కొనుక్కున్నా అని అన్నారు. ఇక తాను సినిమా ఇండస్ట్రీలో ఉండగా.. మందు తాగకూడదని డిసైడ్ అయినట్టు చెప్పారు మురళీమోహన్. వీటితో పాటు లవ్ ఎఫైర్, గ్యాబ్లింగ్, కార్డ్స్ ఆడకూడదు.. సెకండ్ హౌస్ లాంటివి ఉండకూడదని నిశ్చయించుకున్నానన్నారు. ఏఎన్నార్ గారు నరాలు యాక్టివ్ కావడం కోసం రోజూ ఈవినింగ్ రెండు పెగ్స్‌ ఫారిన్ మందు వేయాలని చెప్పారని గుర్తుచేసుకున్నారు మురళీమోహన్. కాగా మురళీమోహన్.. 2009లో టీడీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడారు. తర్వాత 2014లో తిరిగి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉండటమే కాకుండా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SY3jgI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...