సెకండ్ వేవ్లో కరోనా భయంకరంగా వ్యాపిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్తును అరికట్టేందకు ప్రభుత్వం లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తోంది. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని.. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే.. మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని సూచిస్తుంది. వీలుంటే డబుల్ మాస్క్ వేసుకోవాలని చెబుతోంది. ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది నిరుపేదలు ఉపాధి కోల్పోయి.. నానా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కనీసం తినడానికి ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి పలువురు సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాయంతో వాళ్లు ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందిస్తున్నారు. తాజాగా నటి కూడా ఈ లిస్టులో చేరారు. అనే సంస్థతో కలిసి పేదల కడుపు నింపేందుకు ఆమె పూనుకున్నారు. ఇందుకు సంబంధించి ఆమె కొద్ది రోజుల క్రితం ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఒక పేదవాడి కడుపు నింపేందుకు 40 రూపాయిలు విరాళంగా ఇస్తే చాలని ఆమె కోరారు. రాశీ ఖన్నా పిలుపు మేరకు రోటీ ఫౌండేషన్ సంస్థకు పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. దీంతో ఆమె హైదరాబాద్లో స్వయంగా ఆకలితో బాధపడుతున్న వారికి రోటీలను అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని రాశీ షేర్ చేశారు. ఆకలిని అన్నికంటే భయంకరమైన రాక్షసిగా అభివర్ణించిన రాశీ తన పిలుపు మేరకు ఉదారంగా విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విరాళంగా వచ్చిన ప్రతీ రూపాయిని సద్వినియోగం చేస్తున్నామని అన్నారు. ఇలాగే దాతలు ముందుకు వస్తే.. మరికొందరికి సహాయం చేసే అవకాశం తమకు లభిస్తుందని పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TE1SUN
v
No comments:
Post a Comment