దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకుంది. రెండో దశలో కరోనా వ్యాప్తి కారణంగా భారతదేశంలో మరోసారి హృదయ విదారకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా బాధితులను ఆదుకొనేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ , ఆయన భార్య కలిసి కోవిడ్ బాధితుల సహాయార్థం నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విరుష్క జోడీ.. దేశం లోని కోవిడ్ బాధితుల కోసం ఓ క్యాంపెయిన్ని ప్రారంభిస్తున్నామని, మిత్రులు, అభిమానులతో పాటు ప్రతీ ఒక్కరు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని కోరారు. పేద ప్రజలకు సహాయం చేసే ఉద్దశ్యంతో #InThisTogether అనే పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా 7 రోజుల్లో 7 కోట్లు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఐదు రోజుల్లో 5 కోట్లు సమకూరాయని, సాయం అందించేందుకు ముందుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు అని విరుష్క జోడీ అన్నారు. ఈ ఫండ్ మొత్తాన్ని అవసరమైన వారికి ఆక్సిజన్, మందులు, టీకా సౌకర్యాన్ని అందించడానికి ఉపయోగించనున్నారు. ''భారత్కు ఇది చాలా కష్టమైన సమయం. ఇలా మనం దేశం బాధపడుతుంటే చూసి.. గుండె తరుక్కుపోతుంది. కాబట్టి, కోవిడ్ బాధితులకు విరాళం ఇచ్చి సహాయం చేద్దాము. ప్రతీ రూపాయి ముఖ్యమైనదే'' అని పేర్కొన్నారు విరుష్క దంపతులు. ఈ ఏడాది జనవరి నెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ సెలబ్రిటీ జోడీ తమ కూతురుకు వామిక అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tDBPcE
v
No comments:
Post a Comment